స్వప్న లోక్ ప్రమాదంలో ఇంటికన్నె యువకుడు దుర్మరణం

స్వప్న లోక్ ప్రమాదంలో ఇంటికన్నె యువకుడు దుర్మరణం

కేసముద్రం- ముద్ర: సికింద్రాబాద్ స్వప్న లోక్ లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన అమర్రాజు ప్రవీణ్ (23)అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడని గ్రామస్తులు తెలిపారు. ప్రవీణ్ ఆర్మీ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయి మెయిన్ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కామర్స్ విధానంపై సికింద్రాబాద్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ప్రవీణ్ మరణ వార్త తెలుసుకున్న బంధువులు హైదరాబాదుకు తరలి వెళ్లారు