నా చేత బుక్కెడు బువ్వ తిను అవ్వా!

నా చేత బుక్కెడు బువ్వ తిను అవ్వా!

కేసముద్రం, ముద్ర: దేశానికి అన్నం పెడుతున్న మీరు ఈరోజు నా చేత బుక్కెడు బువ్వ తినండి అంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పలువురు మహిళా రైతులకు ఆప్యాయంగా అన్నం తినిపించిన సంఘటన కేసముద్రం మండల కేంద్రంలో జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని కేసముద్రం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన అనంతరం వ్యవసాయంలో అభివృద్ధి సాధించిన మహిళా రైతులను ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత ఆవిర్భావ వేడుకలకు హాజరైన రైతులతో ఎమ్మెల్యే సహ పంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా తన కిరువైపులా కూర్చున్న మహిళా రైతులకు ఆప్యాయంగా అన్నం తినిపించి ఆకట్టుకున్నారు.