దంతాలపల్లిలో చెట్టును డీ కొన్న కారు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

దంతాలపల్లిలో చెట్టును డీ కొన్న కారు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రానికి సమీపంలో శనివారం ఓ..కారు చెట్టును డీకొట్టిన సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. అక్కడికక్కడే ఒకరు మృతిచెందగా. మరొకరు 108లో హాస్పటల్ కు తరలిస్తుండగా మృతిచెందారు. అదే కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు హాస్పిటల్ కు తరలించారు.

నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా మృతులను గుర్తించారు. మృతి చెందిన ఇద్దరు  శామీర్...డ్రైవర్ హలీం గా గుర్తించారు. నిర్మల్ నుండి ఖమ్మం వెళ్తుండగా ఈ..ప్రమాదం సంభవించింది మృతుల వద్ద 4లక్షల రూపాయలు.2 సెల్ ఫోన్లు ఉండగా పోలీస్ వారికి  తొర్రూరు108 సిబ్బంది ఈఏంటిలు డ్యాగ ఉదయ్ కుమార్.పైలట్ ఏనుగంటి రమేష్ అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.