పాడే మోయడం ఆ ఎమ్మెల్యే కు పరమ ఇష్టం..!?

పాడే మోయడం ఆ ఎమ్మెల్యే కు పరమ ఇష్టం..!?

వినూత్నత చాటుతున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్

కేసముద్రం- ముద్ర: ఎవరైనా చనిపోతే ప్రజా ప్రతినిధులు వచ్చి పరామర్శించడం.. మృతుల బంధువులను ఓదార్చడం... మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించి, సంతాపం తెలపడం సర్వసాధారణం. అయితే అందుకు భిన్నంగా ఎవరైనా చనిపోయారని తెలిస్తే చాలు అంత్యక్రియల్లో పాల్గొని మరణించిన వారి పాడే మోయడం అలవాటుగా మార్చుకున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్. మహబూబాబాద్ నియోజకవర్గంతో పాటు తనకు తెలిసినవారెవరైనా చనిపోతే ఎమ్మెల్యే శంకర్ నాయక్ అక్కడికి వెళ్లి మృతుల బంధువులను పరామర్శించడంతో పాటు మృతి చెందిన వారి అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో కేసముద్రం మండల కేంద్రానికి చెందిన బాలు నాయక్ అనే వ్యక్తి ప్రమాదంలో ఆకస్మికంగా మరణించగా, మంగళవారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాబాద్ నుంచి హుటా హుటిన కేసముద్రం చేరుకొని, బాలు నాయక్ భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించడంతోపాటు అంత్యక్రియలో పాల్గొని పాడేమోసారు. ఇలా ఇప్పటివరకు చనిపోయిన వందలాది మంది అంత్యక్రియల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొని పాడే మోసి వినూత్నతను చాటుకుంటున్నారు.