దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకోసం  కృషి చేయాలి - అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్..

దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకోసం  కృషి చేయాలి - అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్..

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ అన్నారు.
మహబూబాబాద్  జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం  జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 76వ వర్దంతి  వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు అతిధులు  ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం అదనపు కలెక్టర్ డేవిడ్  మాట్లాడుతూ...అక్షర జ్ఞానం, ఆర్థిక స్థోమత లేని నిరుపేద రైతు కుటుంబానికి చెందిన దొడ్డి కొమరయ్య తెలంగాణ  రైతు సాయుధ పోరాటంలో దొరలు, రజాకార్ల దుర్మార్గాలను ఎదిరించి, దేశముఖ్ ల ప్రాముఖ్యత పెరిగిపోయిన రోజుల్లో వారిని తరిమేసి  పోరాటాన్ని చేసి   అమరుడయ్యాడని కొనియాడారు.  ప్రజలందరూ చైతన్య వంతులుగా ఉండి సంఘటితంగా సమస్యలను పరిష్కరించుకొని, దొడ్డి కొమురయ్య ఆశయాలను సాదించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో   బిసి సంక్షేమ అభివృద్ధి  అధికారి నరసింహ స్వామి, పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్,  బియంపిఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్,సభ్యులు , తెలంగాణ యాదవ మహాసభ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్, గౌరవ అధ్యక్షులు నేతుల వెంకన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతుల దిలీప్, జిల్లా సహాయ కార్యదర్శి నసర్ల బాబురావు, తదితరులు పాల్గొన్నారు.