ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

శంకరపట్నం ముద్ర జులై 4:-మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కనకం సాగర్ ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలపై వివక్ష చూపుతుందని కొన్ని పాఠశాలలో వంట గదులు లేవని మరికొన్ని పాఠశాలలో అటేండర్స్ లేరని అన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు -మన బడి కార్యక్రమం  అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  ఆకాష్, అఖిల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.