కోడలిని చంపిన మామ..

కోడలిని చంపిన మామ..

ముద్ర,జగిత్యాల : కోడలిపై అనుమానంతో మామ గొంతు కోసి హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. రేచపల్లి గ్రామానికి చెందిన వివాహితను ఆమె మామ ఆకుల రాజిరెడ్డి తెల్లవారుజామున గొంతుకోసి హత్య చేసినట్లు స‌మాచారం.మృతురాలి భర్త తిరుపతి రెడ్డి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. అయితే కోడలికి అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే మామ హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.