తండ్రిని హత్య చేసిన కొడుకు

తండ్రిని హత్య చేసిన కొడుకు

గూడూరు, ముద్ర: కన్న తండ్రిని కొడుకు కొట్టి హత్య చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగల వేణిలో జరిగింది. స్థానిక శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న కందాలం లింగచారి (70)ని అతడి చిన్న కుమారుడు కందాలం రమేష్ కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి తగాదాలే కారణమని భావిస్తున్నారు. లింగచారి మరో కుమారుడు బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.