గుండెపోటుతో కొడుకు,  తట్టుకోలేక తల్లి మృతి

గుండెపోటుతో కొడుకు,  తట్టుకోలేక తల్లి మృతి
  • కూచన్ పల్లిలో విషాదం

ముద్ర ప్రతినిధి, మెదక్:గుండెపోటుతో కొడుకు మృతి చెందగా తట్టుకోలేక మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా హవేళీ ఘణపూర్ మండలం కూచన్ పల్లిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన  వీరప్పగారి నర్సాగౌడ్ (35) తెల్లవారుజామున గుండెపోటు రాగ మెదక్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అది చుసిన తల్లి లక్ష్మి(62) మరణించింది. నర్సాగౌడ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాదం అలుముకుంది.