Janasena - ఎన్నికల వేళ జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్....!

Janasena - ఎన్నికల వేళ జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్....!

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఎన్నికల వేళ జనసేన పార్టీకి ఏపీ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని ఇటీవల హైకోర్టులో జనసేన సవాల్ చేసింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల పరిధిలోని ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ సింబల్ కేటాయించమని కోర్టుకు ఈసీ తెలిపింది.

ఒకవేళ ఎవరికైనా గ్లాస్‌ గుర్తు కేటాయించినా మారుస్తామని వెల్లడించిది. మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు 6 ఎంపీ స్థానాల పరిధిలో గాజు గ్లాసు కేటాయించారని జనసేన గతంలో తెలిపింది. ఈసీ ఇచ్చిన వివరణతో జనసేన పార్టీ సంతృప్తి చెందింది. ఇండిపెండెంట్లకు గ్లాస్‌ గుర్తు కేటాయిస్తే తమకు భారీగా ఓట్లు చీలుతాయని భావించిన జనసేన హైకోర్టును ఆశ్రయించింది.