సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి సస్పెండ్...!

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి సస్పెండ్...!

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ వైసీపీకి అనుకూలంగా సమావేశాలు నిర్వహించినట్లు ఫిర్యాదు చేయడంతో వెంకటరామిరెడ్డిని తక్షణమే సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీకి అందిన ఫిర్యాదుతో విచారణ జరిపిన కడప జిల్లా కలెక్టర్.. నివేదికలో ఒక పార్టీకి అనుకూలంగా సమావేశాలు నిర్వహించినట్టు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. అంతేకాదు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ ఉద్యోగులతో రాజకీయపరమైన సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు.