మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా సంక్షేమ ఫలాల గోడ గడియారం ఆవిష్కరణ

మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా సంక్షేమ ఫలాల గోడ గడియారం ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ, పథకాల ప్రగతిని నిరంతరం ప్రజలకు గుర్తుండాలని,ప్రతి ఇంట్లో తెలియాలనే సదుద్దేశంతో  సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండలం రాజక్క పేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.బుధవారం హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల సమాచారంతో రూపొందించిన గోడ గడియారాలను ఆవిష్కరించారు. ఈ వెంకట నరసింహారెడ్డి సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకలో బిజెపి,కాంగ్రెస్ అసత్య ఆరోపణలకు చెక్ పెట్టేలా వ్యూహంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చా దుబ్బాకలో గులాబీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు . ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్రంలో పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లే అని అహంకార పూరిత మాటలు మాట్లాడిన మనుషుల పంత పగలగొట్టినంతలా పని చేసిన కేసీఆర్ తెలంగాణ అంటే ఇది అని సగర్వంగా  దేశానికి చాటి చెప్పుతున్నారన్నారు.