బిఆర్ఎస్ జండాలను ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

బిఆర్ఎస్ జండాలను ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

బారాయిమం వద్ద అంబలి కేంద్రం ప్రారంభించిన మంత్రి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేటలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ జెండాను రాష్ట్ర ఆర్థిక, వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవిష్కరణ చేశారు. మొదట సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డ్ కమాన్ వద్ద పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి ఏర్పాటుచేసిన పార్టీ జెండాను మంత్రి హరీష్ రావు ఎగురవేశారు. అనంతరం కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు.తర్వాత సిద్దిపేటలోని భారా ఇమామ్ వద్ద అ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ఏర్పాటుచేసిన పార్టీ జెండాను మంత్రి హరీష్ రావు ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. పలువురికి తన చేతుల మీదుగా అంబలి పోశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ వార్డు శాఖల అధ్యక్షులు, కార్యదర్శిలు, యువజన నేతలు, మహిళా నేతలు , మున్సిపల్ కౌన్సిలర్లు  విద్యార్థి నాయకులు పార్టీ సిద్దిపేట పట్టణ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.