నిరసన జ్వాల

నిరసన జ్వాల

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లాలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం జనగామ మండలం గానుగుపహాడ్ ఎక్స్ రోడ్ వద్ద రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే తో పాటు కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని పేర్కొన్నారు. రైతుల ధర్నాకు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి, బీజేవైఎం నాయకులు మద్దతు తెలిపారు.