కాంగ్రెస్‌ గ్యారెంటీ పథకాలపై ప్రచారం

కాంగ్రెస్‌ గ్యారెంటీ పథకాలపై ప్రచారం

ముద్ర ప్రతినిధ, జనగామ: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు శనివారం జనగామ పట్టణంలో కాంగ్రెస్‌ గ్యారెంటీ పథకాలపై నాయకులు ప్రచారం నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో  వివర్స్ కాలనీ 12వ వార్డులో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొంతపల్లి నాగరాజు, కొండా కిరణ్ నేతృత్వంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పథకాలైన గృహ లక్ష్మి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, యువ వికాసం, చేయూత వంటి 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు విరించారు. రాబోయే ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

 కార్యక్రమం లో టీపీసీసీ సభ్యుడు చెంచరపు శ్రీనివాస్ రెడ్డి, జనగామ జిల్లా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాసం పల్లి లింగాజీ, పార్టీ మండల అధ్యక్షులు కొన్నే మహేందర్ రెడ్డి, ఓబీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ చింతకింది మల్లేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మాజీద్, ఎంపీటీసీ సలెంద్ర శ్రీనివాస్, కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షుడు సుల్తాన్ గోవింద్ రెడ్డి, జనగామ ప్రధాన కార్యదర్శి నోముల రాజు, ఉపాధ్యక్షులు పిట్టల రాజేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు  రంగు రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు సౌడ మహేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్నే నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.