ఈవీఎం గోడౌన్ తనిఖీ

ఈవీఎం గోడౌన్ తనిఖీ

ముద్ర ప్రతినిధి, జనగామ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) గోడౌన్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గోడౌన్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుహాసిని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గోడౌన్ పరిసరాలు, సీసీ కెమెరాలు, విద్యుత్, భద్రత, ఫైర్ సెక్యూరిటీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆయన వెంట జనగామ ఈఆర్వో మురళీకృష్ణ, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, రాజకీయ పార్టీ ప్రతినిధులు రావెల రవి (బీఆర్ఎస్), ఉడుత రవి (కాంగ్రెస్), విజయ్ భాస్కర్ (బీజేపీ), సోమయ్య (సీపీఐ), జె.కుమార్ (బీఎస్పీ), ఎన్నికల విభాగం అధికారులు, తహసీల్దార్లు యతేషాం అలీ, శ్రీనివాస్ ఉన్నారు.