అంబేద్కర్‌‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్‌‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ముద్ర ప్రతినిధి, జనగామ: డాక్టర్‌‌ బి.ఆర్‌‌ అంబేద్కర్‌‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనగామ డీపీఆర్వో పి.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. శుక్రవారం బాబా సాహెబ్‌ జయంతి వేడుకలను కలెక్టరేట్‌లోని డీపీఆర్వో ఆఫీస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యంగం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు.

ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌‌ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో కళాకారులు గట్టగళ్ల సంజీవ, జనగామ శంకర్, కారుపోతుల సోమన్న, పిన్నింటి రత్నం, ముక్కెర సంపత్ కుమార్, గడిపి బాలయ్య, తిప్పర్తి శ్రీనివాసులు, కేమిడి కనకరాజు, పన్నీరు శ్రీనివాస్, గెంటే హరి ప్రసాద్, అనపర్తి స్వప్న, సల్ల చామంతి, మమత, రంజాన్ బీ, తెలంగాణ కళాకారుల సంఘం గజవెల్లి  ప్రతాప్, జి.మౌనిక తదితరులు పాల్గొన్నారు.