అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యం

అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యం
  • జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: అంధత్వ రహిత తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పరిషత్ చైర్మన్ పి.సంపత్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారేపల్లి తిరుమల కృష్ణా మోహన్ రెడ్డి, యంపిటిసి మారేపల్లి లలితాదేవి - శ్యామ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎంపీ ఓ మధు సూదన్, మల్కాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాజమౌళి పార్టీ శ్రేణులు, ప్రభుత్వ అధికారులు, ఆశావర్కర్లు తదితరులు ఉన్నారు.