కరెన్సీ తరలిస్తున్న కారులో అగ్నిప్రమాదం
రూ.15 లక్షల వరకు బుగ్గిపాలు
ముద్ర ప్రతినిధి, జనగామ (వరంగల్) : కారులో డబ్బులు తరలిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగి కరెన్సీ కాస్త కాలి బూడిదైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెద్దమొత్తంలో కరెన్సీని ఓ కారు ఇంజన్లో పెట్టి తరలించేందుకు ప్లాన్ చేశారు. మామునూరు వాగ్దేవి కాలేజీ దగ్గరకు రాగానే కారు ముందు భాగంగాలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన వారు వెంటనే కారును నిపివేశారు.
ముందు భాగంగా కరెన్సీకి ఎస్కాడ్గా ఉన్న మరో కారులో కొంత డబ్బులను తరలించుకు పోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మంటలు చెలరేగిన కారును పీఎస్కు తరలించారు. కారులో కాలిపోయిన కరెన్సీ సుమారు రూ.15 లక్షల వరకు ఉంటాయని పోలీసుల భావిస్తున్నారు. కారుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.