కడియంకు ఓటమి తప్పదు .. దళిత నాయకులు

కడియంకు ఓటమి తప్పదు .. దళిత నాయకులు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: బిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి ఓటమి తప్పదని దళిత నాయకులు మారపాక రవి, చేపూరి చిరంజీవి, గుర్రం యాదగిరి చింత ఝాన్సీ, మారపాక ఏలియా అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థిని మానసికంగా దెబ్బతీసేందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గతం తెలుసు అన్నారు. నువ్వు మంత్రిగా ఉన్న రోజుల్లో ఎన్కౌంటర్లు జరిగాయి అన్నారు.

మా అభ్యర్థి ఇందిరా కష్టపడి సంపాదిస్తే నువ్వు రాజకీయంగా సంపాదించుకున్న అన్నారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నువ్వు మహిళ అని చూడకుండా నడవలేవు, కూర్చుంటే లేవ లేవని వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నియోజకవర్గ మాదిగలు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారని మూడో తేదీన మా సత్తా ఏంటో చూపించి నీ దిష్టిబొమ్మ దహనం చేసే రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. ఈ సమావేశంలో కత్తుల కట్టయ్య, నాగరబోయిన శ్రీరాములు, కాసాని బొందయ్య, మార్కు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.