చేనేత ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా వేముల

చేనేత ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా వేముల

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజి గూడెం గ్రామానికి చెందిన వేముల వెంకటేశ్వర్లు ను జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్, రాష్ట్ర అధ్యక్షుడు రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘం అభివృద్ధికి తాను కృషి చేస్తానని అన్నారు. తనకి ఈ అవకాశం కల్పించిన జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.