కాంగ్రెస్ ఆన్లైన్ క్విజ్ పోటీ పోస్టర్ ఆవిష్కరణ
![కాంగ్రెస్ ఆన్లైన్ క్విజ్ పోటీ పోస్టర్ ఆవిష్కరణ](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_648c6b661577e.jpg)
కాంగ్రెస్ ఆన్లైన్ క్విజ్ పోటీ పోస్టర్ ఆవిష్కరణ
ముద్ర ప్రతినిధి, జనగామ: జులై 2న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీల పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. పార్టీ క్యాంపు ఆఫీస్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీసీసీ జనగామ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కోట్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగంతో బాధపడుతున్న యువత కోసం ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకగాంధీ ఆధ్వర్యంలో యూత్ నిరుద్యోగ డిక్లరేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. దీనిని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గ్రామగ్రామాన వివరించాలన్నారు. యువతీ, యువకులు రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ పోటీలో రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్షలో పాల్గొనాలని కోరారు.
ఈ క్విజ్ పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి నియోజకవర్గం వారిగా బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ చెంచారపు శ్రీనివాసరెడ్డి, జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ, మద్దూరు జెడ్పిటీసీ గిరికొండల్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికే ఇందిరా, కృష్ణ స్వామి, జనగామ మండల అధ్యక్షుడు కొన్నే మహేందర్ రెడ్డి, ఎన్ఎస్ యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు జక్కుల వేణుమాధవ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు లోక్కుంట్ల ప్రవీణ్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు సంపత్ నాయక్, జనగామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మాజీద్, జనగామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్ట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.