ప్రతి ఒక్కరూ ‘కోడ్‌’ను పాటించాలి

ప్రతి ఒక్కరూ ‘కోడ్‌’ను పాటించాలి
  • వెస్ట్‌ జోన్‌ డీసీపీ సీతారాం
  • ఎంపీ పసునూరి, కాంగ్రెస్‌ నేత ఠాక్రే వాహనాల తనిఖీ

ముద్ర ప్రతినిధి, జనగామ : ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలని వెస్ట్‌ జోన్‌ డీసీపీ డీసీపీ సీతారాం సూచించారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా జనగామ జిల్లా పెంబర్తి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం డీసీపీ సీతారాం, ఏసీసీ దేవేందర్‌‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌ యాదవ్‌ స్వయంగా వాహనాల తనిఖీ చేశారు. ఇదే సమయంలో  వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌‌, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌ రావు ఠాక్రే హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్తుండగా వారి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి వెంట ఎస్సై సృజన్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.