బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా ఆవిర్భావ వేడుకలు

బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా ఆవిర్భావ వేడుకలు

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లా ఆవిర్భావ వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చౌరస్తాలో ఉన్న జిల్లా స్థూపానికి పార్టీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి పూలమాల వేశారు. అనంతరం పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆరుట్ల దశమంతరెడ్డి నాడు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహించి ప్రాణాల్ని ఫణంగా పెట్టి జిల్లా సాధించుకున్నామని పేర్కొన్నారు. అలాంటి ఈ ప్రాంతంలో స్థానికేతరులు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. జనగామ జిల్లా అవతరించి ఏడేళ్లు పూర్తయినా అభివృద్ధికి నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ అభివృద్ధి కావాలంటే స్థానికుడే పాలకుడు కావాలన్నారు. జనగామ ప్రజలారా.. స్థానికేతరులను తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్, ప్రధాన కార్యదర్శి చౌడ రమేష్, ఉద్యమకారులు ఆకుల సతీష్, కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు తోకల హరీష్, గోధుమల అశోక్, కేశపురం రవి, కడమంచి రమేష్ , బింగి రమేష్, కోట వినోద్, గణపురం కార్తీక్, ఉల్లెంగుల రాజు పాల్గొన్నారు.