అభివృద్ధి నిరంతర ప్రక్రియ
![అభివృద్ధి నిరంతర ప్రక్రియ](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6469d5f395aa3.jpg)
- ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య
- పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
జఫర్ గడ్, ముద్ర : అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కూనూరులో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాటమయ్య పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలబిందెల కార్యక్రమంలో పాల్గొని మహిళతో కలిసి 'జలబిందె' ను ఎత్తుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సకల దేవుళ్ల దీవెనలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.
ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంఖుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ మార్కెట్ చైర్మన్ గుజరి రాజు, ఎంపీపీ రడపక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కోడారి కనకయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, గౌడ సంఘ ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.