రూ.1.5 లక్షల ఎల్‌వోసీ అందజేత

రూ.1.5 లక్షల ఎల్‌వోసీ అందజేత

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ మండలం పెద్దపహాడ్ గ్రామాకి చెందిన నిరుపేద పద్మశాలీ కుటుంబానికి బీఆర్‌‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ రూ.1. 5 లక్షల ఎల్‌వోసీని శనివారం అందజేశారు. గ్రామానికి చెందిన చక్రాల భాస్కర్‌‌కు కొన్ని రోజులుగా చాతిపై కణతితో బాధపడుతున్నాడు.. వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుండడంతో ఈ విషయాన్ని స్థానిక నాయకులు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సీఎం ఆర్‌‌ఎఫ్ స్కీం కింద రూ.1.5లక్షల ఎల్‌వోసీని మంజూరు చేయించి, ఆ పత్రాన్ని బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో చక్రాల నరేష్, చక్రాల రాణి, సాయికుమార్, పాషా, గణేష్, ఉదయ్, సాయికిరణ్, రాజు  పాల్గొన్నారు.