కడియం గెలుపు కోసం సైనికులుగా పనిచేస్తాం

కడియం గెలుపు కోసం సైనికులుగా పనిచేస్తాం
  • కడియంని కలిసిన బిఆర్ఎస్  నాయకులు

ముద్ర, స్టేషన్ ఘన్‌పూర్: కడియం శ్రీహరి గెలుపు కోసం సైనికుల్లా పనిచేస్తామని బిఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్ అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరిని ఆయన నివాసంలో  బిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లకావత్ చిరంజీవి నాయక్  మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కడియం శ్రీహరిని అత్యదిక భారీ మెజారిటీతో గెలిపించి,  ముఖ్యమంత్రి కెసిఆర్ కి బహుమతిగా అందజేస్తామని, అదే విధంగా లక్షా మెజారిటీ  లక్ష్యంగా  విద్యార్థి నాయకులుగా పని చేస్తామని తెలిపారు.  కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేస్తున్న పనులు గ్రామ గ్రామానికి , ఇంటింటికీ ప్రజలలో తీసుకెళ్తామని,  ప్రచారంలో సైనికులుగా మేము మీ తోడు ఉంటామని అన్నారు. వారి వెంట అధ్యక్షుడు కందుకూరి ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, ఘనపూర్ మండల బిఆర్ఎస్వీ అధ్యక్షుడు బోంకూరి మహేష్, పిట్టల అనిల్, ధర్మసాగర్ మండల అధ్యక్షుడు ఆకారపు మహేష్, రఘనాదపల్లి మండల అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీధర్, వేలేరు మండల అధ్యక్షుడు బంక శ్రీనివాస్, కొలకొల మనోజ్, వినయ్, జయంత్, దినేష్ వీరితో పాటు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.