వెండి ఉద్దరిని బహుకరణ

వెండి ఉద్దరిని బహుకరణ

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పల్లగుట్ట గ్రామానికి చెందిన గాదర్ల భారతి, లింగారెడ్డి దంపతులు వెండి ఉద్దరిని బహుకరించారు.  కార్తీక సోమవారము శ్రీ స్వామివారికి వెండి ఉద్దరిని  గిన్నెను బహుకరించి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి, బి.లక్ష్మీ ప్రసన్న, అభివృద్ధి కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు సౌమిత్రి రంగాచార్యులు, బి. రవీందర్ శర్మ, కృష్ణమాచార్యులు భక్తులు ఆలయ సిబ్బంది  పాల్గొన్నారు.