అభివృద్ధిలో కడియం మార్క్ చూపిస్తా ...

అభివృద్ధిలో కడియం మార్క్ చూపిస్తా ...
  • స్టేషన్ లో బిఆర్ఎస్ జెండా ...
  • కాంగ్రెస్ వి మోసపూరిత హామీలు ..
  • మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వండి నియోజకవర్గ అభివృద్ధిలో కడియం మార్క్ చూపిస్తానని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లగుట్ట లో చిల్పూరు దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ గ్రామ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు పల్లగుట్ట గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేసినట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలందరు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సమస్యను పరిష్కరించుకున్నామని అన్నారు.

కెసిఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసి రైతును రాజును చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, శాదీముభారక్, కెసిఆర్ కిట్టు, అమ్మఒడి, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలను అమలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. అవినీతి, స్కాంలతో పేరుకుపోయిన కాంగ్రేస్ పార్టీ తరిమి కొట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ది చేసి చూపెడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొట్టు మానస, చిర్ర నాగరాజు గౌడ్, డాక్టర్ పేరాల సుధాకర్, సంపత్ రాజు, వేల్పుల గట్టయ్య, చల్లారపు శ్యామ్ సుందర్, రవీందర్, జీడి ఆనందం, ఎల్లయ్య, రవీందర్, గోపాల్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నేతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.