కాంగ్రెస్ లో చేరిన మాజీ కౌన్సిలర్

కాంగ్రెస్ లో చేరిన మాజీ కౌన్సిలర్

జనగామ టౌన్, ముద్ర : జనగామ పట్టణంలోని 16వ వార్డు బీజేపీ మాజీ  కౌన్సిలర్ కడకంచి మల్లమ్మ, కడకంచి రమేష్ ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన 500 మంది శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి డీసీసీ ప్రెసిడెంట్, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పిసిసి మెంబర్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, జనగామ జిల్లా నాయకులు, మేడ శ్రీనివాస్ ,16వ వార్డు కౌన్సిలర్ గాదపాక రామచందర్, మిద్దపాక స్టాలిన్, శ్యామ్, మిద్దపాక ప్రసాద్, తిప్పారపు అనిల్, నాగిళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.