శాకాంబరిగా ‘ఉప్పలమ్మ’ తల్లి

శాకాంబరిగా ‘ఉప్పలమ్మ’ తల్లి

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని 27 వార్డు ఉన్న ఉప్పలమ్మ దేవాలయంలో ఆషాడ మాస చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని వార్షిక ఉత్సాహాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు  శాకాంబరిగా భక్తులకు దర్శనమిఇచ్చారు. ఆలయ పూజారి వారణాసి పవన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్తా, ఈవో చిందం వంశీ , క్లర్క్‌ మధుతోపాటు ఆరుట్ల దశమంత రెడ్డి, శోభ అనంతరెడ్డి, చెంచారపు వీరారెడ్డి, కూరగాయల లింగయ్య, చెంచారపు శ్రీరామ్ రెడ్డి, లోకమంతా రెడ్డి, బండా యాదగిరి రెడ్డి, ఓరుగంటి ఆంజనేయులు, గట్టు దామోదర్, ధర్మపురి శ్రీనివాస్, మార్గం రవి, లగిశెట్టి వీరలింగం ఓరిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.