కార్యకర్తలను కాపాడుకుంటా

కార్యకర్తలను కాపాడుకుంటా
  • కొడకండ్ల మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి

ముద్ర, పాలకుర్తి :  బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని  రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలకేంద్రంలో గ్రామాల వారీగా వేరు వేరుగా కార్యకర్తలతో సమావేశమయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్త సమస్యలను తీర్చే బాధ్యత తనదేనన్నారు. కార్యకర్తల కుటుంబంలో సభ్యుడిగా అండగా ఉంటానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. ఈ సమావేశం లో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు సిందే రామోజీ, మార్కెట్ చైర్మన్ పేరు రాము, ఎంపీపీ జ్యోతి,   మోహన్ గాంధీ నాయక్, డిసిసి బెడ్ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, అందే యాకయ్య  తదితరులు పాల్గొన్నారు.