వికలాంగుడి కుటుంబానికి అండ

వికలాంగుడి కుటుంబానికి అండ

ముద్ర, పాలకుర్తి: పాలకుర్తి పట్టణ కేంద్రానికి చెందిన మానసిక వికలాంగుడు గాయాల మధు, గాయాల సోమయ్యల ఆర్థిక పరిస్థితి బాగోలేక  ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న అమ్మా చారిటబుల్  ట్రస్ట్ ప్రతినిధులు వారిని పరామర్శించి 25కిలోల బియ్యం, నెల సరిపడా నిత్యావసరాలను డి.మహేష్ గారి పెండ్లి రోజు సందర్భంగా వారి సహకారంతో అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జీడి హరీష్, ఇరుగు ఎల్లేష్, పెండ్లి భాస్కర్ పాల్గొన్నారు.