బీఆర్ఎస్లో చేరిన నాయకులు
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్
జనగామ టౌన్, ముద్ర: జనగామ జిల్లాలో జరిగిన కేసీఆర్ సభలో కాంగ్రెస్, బీజెపీ నాయకులు బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్యతో పాటు బీజెపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కౌన్సిలర్ బోట్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ధర్మపురి శ్రీనివాస్, మాజీద్, డాక్టర్ రాజమౌళి, ఎర్రమల్ల లక్ష్మన్, వకుళభరణం నర్సయ్య పంతులు, ఇక్బాల్, జంగిటి అంజయ్య, గురువయ్య గౌడ్, నర్ర రమణరెడ్డి, నాగమళ్ల శ్రీనివాస్, బూర శ్రీనివాస్ గౌడ్, కూరపాటి మధు, సుల్తాన్ గోవింద్ రెడ్డితో పాటు పలువురు చేరారు. వీరందరికీ సీఎం కేసీఆర్ స్వయంగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.