బిఆర్ఎస్ ను గెలిపించండి ... జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి

బిఆర్ఎస్ ను గెలిపించండి ... జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ప్రతి ఇంటికి పెద్ద కొడుకుల ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అందించిన బిఆర్ఎస్ పార్టీని మూడోసారి గెలిపించాలని జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి తో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 60 ఏళ్లలో లేని అభివృద్ధి పదేళ్లలో చూపించిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోమారు అధికారంలోకి వచ్చేందుకు స్థానిక అభ్యర్థి కడియం శ్రీహరి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు నీల రాజు, సర్పంచ్ రవీందర్, ఎంపీటీసీ రవీందర్ గ్రామ శాఖ అధ్యక్షుడు వెన్నo మాధవరెడ్డి, ఉపసర్పంచ్ వంశీ మాజీ మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, మండల రైతు కోఆర్డినేటర్ జనగాం యాదగిరి చిల్పూర్ గ్రామ సర్పంచ్ రాజకుమార్ నాయకులు పాల్గొన్నారు.