సంక్షేమ పథకాలు కాంగ్రెస్ తో సాధ్యం..

సంక్షేమ పథకాలు కాంగ్రెస్ తో సాధ్యం..
  • కెసిఆర్ ప్రజల్ని మోసగించాడు ..
  • జడ్పీ మాజీ చైర్ పర్సన్ ధన్వంతి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: పేద ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల అమలు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని జడ్పీ మాజీ చైర్ పర్సన్, నియోజకవర్గ కోఆర్డినేటర్ లకావత్ ధన్వంతీ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఐటీ ని అమల్లోకి తెచ్చాడన్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా నేటి యువత పక్క త్రోవ పడుతుందన్నారు. అలాంటి యువతను మేల్కొల్పి పోటీ పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి అన్నారు.

9 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలను విస్మరించి రాష్ట్ర ప్రజలు మోసం చేశాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అనేక పథకాలను అమలు చేసి ఆదుకుంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గపై కాంగ్రెస్ జెండాను ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నియోజకవర్గ ఇన్చార్జ్ సింగపురం ఇందిరా, జగదీష్ చంద్ర రెడ్డి, దిలీప్ రెడ్డి, కోళ్ల రవి, గడ్డమీద సురేష్, ఝాన్సీ, సింగపురం జోజి, కోరుకొప్పుల మహేందర్, గట్టు కోటి, నారగోని పద్మ, మారపాక ఏలియా, ప్రశాంత్, ఊమ్లా నాయక్, గుగులోతు మధు, దళిత రత్న అవార్డు గ్రహీత రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.