విద్యార్థులను వేధిస్తున్న ప్రైవేట్ కాలేజీలు
![విద్యార్థులను వేధిస్తున్న ప్రైవేట్ కాలేజీలు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640f2c4b019a8.jpg)
ముద్ర ప్రతినిధి, జనగామ : ఫీజులు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని ఇంటర్ విద్యార్థులను వేధిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ జనగామ జిల్లా అధ్యక్షుడు చిలువేరు అభి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ శివలింగయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీస్ (డీటీడీవో) ఏర్పాటు చేసి ఎస్టీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొన్ని ప్రైవేట్ కాలేజీలు పరీక్షల టైంలో ఇంటర్ స్టూడెంట్లను ఫీజుల పేరుతో వేధిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో గాయత్రి, శివ, ప్రేమ్, కిషన్, రవి తేజ తదితరులు పాల్గొన్నారు.