బాబుకు మద్దతుగా సత్యగ్రహ దీక్ష

బాబుకు మద్దతుగా సత్యగ్రహ దీక్ష

ముద్ర ప్రతినిధి, జనగామ: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా జనగామలో టీడీపీ ఆధ్వర్యంలో సత్యగ్రహ దీక్ష నిర్వహించారు. పట్టణంలో టీడీపీ కార్యాలయంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామిని హరీశ్‌ ఆంధ్ర ప్రదేశ్‌లో జనగ్‌ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందని విమర్శించారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఒక్క రోజు సత్యగ్రహ నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది  నాయకులు దీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య, బెడిదే మైశయ్య, తాళ్లపల్లి ఏల్లేష్, నామాల శ్రీనివాస్ గౌడ్, సీసా శ్రీధర్, గోళ్ల శ్రీనివాస్ రావు, గుగూలోతు కనకరాజు, ఎండీ సీరాజు, ఎండీ ఏక్బాల్, వ్రుకోధర్ రెడ్డి, పరకాల శ్రీనివాస్ గౌడ్, ఎండీ చోటేమియ, గడ్డం కృష్ణ, మమిడాల యాదగిరి, బూడిద సత్యనారాయణ, జిట్ట యాదగిరి తదితరులు పాల్గొన్నారు.