ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య

ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెం గ్రామానికి చెందిన ముడిక వెంకటయ్య(55) అనే రైతు చెట్టుకు ఉరువేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జరిగింది. రోజువారీగా వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్లిన వెంకటయ్య తన వ్యవసాయ క్షేత్రంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య కళావతి, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. తనకున్న మూడు ఎకరాలతో పాటు కొంత కౌలు కూడా చేస్తున్న అతని మృతికి ఆర్థిక ఇబ్బందులా, కుటుంబ కలహాలు కారణమా తెలియాల్సి ఉంది.