తరిగొప్పులలో ‘కొమ్మూరి’ యాత్ర

తరిగొప్పులలో ‘కొమ్మూరి’ యాత్ర

ముద్ర ప్రతినిధి, జనగామ (తరిగొప్పుల) : టీపీసీసీ మెంబర్‌‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చేపట్టిన హాత్‌ సే హాత్ జోడో అభియాన్ యాత్ర మూడో రోజైన సోమవారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో కొనసాగింది. మండలంలోని పలు గ్రామాల్లో ఆయన యాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. రాహుల్ గాంధీ సందేశ పత్రాలను అందిస్తూ.. రానున్న రాజ్యం ఇందిరమ్మ రాజ్యమని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.

మండల పరిధిలోని ఎన్యానాయక్ తండా నుంచి యాత్ర ప్రారంభం కాగా తండాలో ఎన్యానాయక్ దంపతులకు నివాళి అర్పించి, గ్రామ ప్రజలకు వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మూదావత్ సంపత్, మాజీ జడ్పీటీసీ గాదె మోహన్ రెడ్డి, జనగామ జిల్లా డీసీసీ కార్యదర్శి గంగం నరసింహారెడ్డి, పోతారం మాజీ సర్పంచ్ వగలబోయిన యాదగిరి, చెవుల పర్శరాములు, బొత్తలపర్రె మాజీ ఎంపీటీసీ ముడికే కుమార్, ఇంద్రారెడ్డి, ముండావర్ దేవేందర్, సోలిపురం సర్పంచ్ ఎర్ర లక్ష్మీ సిద్దులు, గ్రామ శాఖ అధ్యక్షుడు దండెం ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.