పల్లె పల్లెకు ‘పల్లా’

  • ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి
  • రోజుకో మండలంలో పర్యటన
  • పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్సీ

ముద్ర ప్రతినిధి, జనగామ :జనగామ బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్టీలో చివరగా టికెట్‌ ప్రకటన చివరలో జరిగినా.. బీ ఫారం మాత్రం ముందుగా అందుకున్న పల్లా ప్రచారంలో మరింత స్పీడ్‌ పెంచి అందరినీ ఆకట్టుకుంటున్నారు. పల్లె పల్లెకు.. గడప గడపకు వెళ్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

 
ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో...

రెండు రోజుల కింద యశ్వంతపూర్‌‌ ఎల్లమ్మ తల్లి దీవనెలతో ప్రచారం మొదలు పెట్టిన రాజేశ్వర్‌‌రెడ్డి మొదట, రెండు రోజుల పాటు తరిగొప్పుల మండలంలో పర్యటించారు. బొంతగట్టునాగారం, బొత్తలప్రె, జాలుబై తండా, మానసింగ్‌ తండా, బాల్య భుక్య తండా, అంకుషాపుర్‌‌, కొత్తతండా, సోలీపురం, పోతారం, అక్కరాజుల్లి, మరియపురం, నర్సాపూర్‌‌, అబ్దుల్‌నాగారంలో  పర్యటించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక శుక్రవారం జనగామ మండలంలో ప్రచారం నిర్వహించారు. చీటకొడూరు, చౌడారం, మరిగడి, పెద్దతండా (ఓ) గ్రామాల్లో పర్యటించడంతో పాటు సాయంత్రం జనగామ రైల్వే స్టేషన్‌ నుంచి జనగామ బస్టాండ్‌ వరకు గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ జమున, ఎంపీపీ కళింగరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండ యాదగిరి రెడ్డి, మేకపోతుల ఆంజనేయులు, ఉడుగుల నర్సింహులు, పసుల ఏబేలు, కందుకూరి ప్రభాకర్, డాక్టర్ సుల్తాన్ రాజా, తిప్పారపు విజయ్, యు.కృష్ణ, ధర్మపురి శ్రీనివాస్, పలు వార్డుల కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.