మత సామరస్యానికి ప్రతీక రంజాన్

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

ముద్ర ప్రతినిధి, జనగామ:  మత సామరస్యానికి ప్రతీక పవిత్ర రంజాన్ మాసం అని జిల్లా ట్రెజరీ అధికారి పి.నర్సింహా రెడ్డి అన్నారు. ఐడీఓసీలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ముస్లిం ఉద్యోగులకు శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి క్షేమం కోసం ముస్లింలు రంజాన్‌ మాసంలో  ఉపవాసాలు ఉంటారన్నారు. కార్యక్రమంలో ఏటీవో చంద్రకళ, ఎస్టీవో శ్రీనివాసులు, ఆడిటర్లు రాజ్ కుమార్, ఇబ్రహీం, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.