పాల సేకరణ పెంచుదాం ... మేనేజర్ లింగారెడ్డి

పాల సేకరణ పెంచుదాం ... మేనేజర్ లింగారెడ్డి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: పాడి రైతులు, సొసైటీలు, విజయ డైరీ సిబ్బంది సమిష్టి కృషితో పాల సేకరణ పెంచుదామని స్టేషన్ ఘన్ పూర్ పాలసీతలీకరణ కేంద్రం మేనేజర్ ఆర్. లింగారెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పాలసీతలీకరణ కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ 40 గ్రామాల పరిధిలో ఉన్న సొసైటీల మధ్య సమన్వయం లేక పరస్పర ఆరోపణలు చేసుకోవడం పాడి రైతులను గందరగోళంలోకి నెట్టిందన్నారు అన్నారు. విజయ డైరీ సిబ్బందిగా తాము ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నామని ఏ రైతును వ్యక్తిగతంగా విమర్శించడం, అసత్య ఆరోపణలు చేయలేదన్నారు. పాడి రైతులు, సొసైటీ సభ్యులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పాల ఉత్పత్తిని పెంచుదాం అన్నారు. సమావేశంలో సూపర్వైజర్లు ధర్మారావు, రాములు ఉన్నారు.