బీఆర్ఎస్ సర్కార్‌‌తోనే అభివృద్ధి స్టేషన్‌ఘన్‌పూర్‌‌ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య

బీఆర్ఎస్ సర్కార్‌‌తోనే అభివృద్ధి స్టేషన్‌ఘన్‌పూర్‌‌ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ (రఘునాథపల్లి):  బీఆర్‌‌ఎస్‌ సర్కార్‌‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పేదోడికి మేలు జరుగుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం రఘునాథపల్లి బీఆర్ఎస్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ ఫలాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, దళిత బంధు ఇలా ఎన్నో పథకాలు తెచ్చారని చెప్పారు. 

పేపర్‌‌ లీకేజీకి కారకుడు బండి సంజయ్‌..
పదో తరగతి తెలుగు, హిందీ పేపర్లు లీకేజీకి కారకుడు బండి సంజయ్‌ అని ఎమ్మెల్యే తాటికొండ ఆరోపించారు. మతత్వ బీజేపీ చేస్తున్న కుట్రలు, అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోడీ నాయకత్వంలో జరుగుతున్న అవినీతిపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు వారాల రమేశ్‌ యాదవ్, ముసిపట్ల అశోక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  ముసిపట్ల విజయ్, డైరెక్టర్లు శివరాత్రి రాజు, హైకోర్ట్ అడ్వకేట్ సుజన్ కుమార్, సోషల్ మీడియా ఇన్‌చార్జి తిపారపు రమ్య బాబురావు, మమత తిప్పారపు, ఎంపీటీసీ కామిడీ రమ్య, సింగిల్ విండో చైర్మన్ రవీందర్ జీ, నామాల బుచ్చయ్య గౌడ్, బిర్రు మధు పాల్గొన్నారు