మంత్రి ఎర్రబెల్లిని కలిసిన రైతులు

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన రైతులు
Farmers met Minister Errabelli
ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ నియోజకవర్గంలోని హన్మంతపూర్, మల్కాపేట అడవికేశవపురం, గానుగపహాడ్, ఎర్రగొల్ల పహాడ్ గ్రామాల రైతులు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు ఆదివారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిశారు. దేవాదుల ద్వారా నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న విషయాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన మంత్రి ఎర్రబెల్లి ఈ నెల 9వ తేదీన ధర్మసాగర్ నుంచి నీటి విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో జనగామ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరగొని యాదగిరి గౌడ్, సర్పంచ్ లు శ్రీనివాస్, జయరాం, శంకర్, నర్సయ్య ఉన్నారు.