ప్రజాస్వామ్య హక్కులకై ఆత్మగౌరవం కోసం దళితలిబరేషన్ పోరాటం:  రాష్ట్ర అధ్యక్షుడు చర్ల ఆనంద్ కుమార్

ప్రజాస్వామ్య హక్కులకై ఆత్మగౌరవం కోసం దళితలిబరేషన్ పోరాటం:  రాష్ట్ర అధ్యక్షుడు చర్ల ఆనంద్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజాస్వామ్య హక్కులకై ఆత్మ గౌరవం కోసం దళిత లిబరేషన్ ఫ్రంట్ అలుపెరుగని పోరాటం చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు చెర్ల ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శి మర్వాడి సుదర్శన్ అన్నారు.  జగిత్యాల జిల్లా కేంద్రంలో ని ఎస్సారెస్పీ గెస్ట్ హౌస్ లోదళిత లిబరేషన్ ఫ్రంట్ జగిత్యాల జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సదర్భంగా ఆనంద్ మాట్లాడుతూ దళితులపై రోజు రోజుకు దాడులు ఎక్కువ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఫలాలు నేటికీ అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు .  అనంతరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. జిల్లా అధ్యక్షులుగా వేల్పుల ప్రవీణ్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా రాజేష్ ప్రవీణ్, సలహాదారులుగా కాయితి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గా మెరుగు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా తీగల శేఖర్ , జాయింట్ సెక్రెటరీగా దూడ నరసయ్య, సంఖ్య మహేష్, రేగుంట సుస్మిత, దాసరి వెంకటి, లీగల్ అడ్వైజర్ గా సండ్రుగు విజయ్ కుమార్,  కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.