ఎల్లారెడ్డిపేట కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శాకంబరీ ఉత్సవాలు

ఎల్లారెడ్డిపేట కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శాకంబరీ ఉత్సవాలు

ముద్ర,ఎల్లారెడ్డిపేట: ఘనంగా శాకంబరి ఉత్సవాలు  శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం లో ఆషాడ మాసం సందర్భంగా శనివారం జరిగాయి. ఆలయపూజారి  గౌతమ్ శర్మ కన్నుల‌ పండువగా నిర్వహించారు. ఆషాడ మాసం  సందర్భంగా ఆలయం లో  శ్రీ వాసవి తల్లీ కి వివిధ రకాల కూరగాయలతో   తయారు చేసిన దండలతో  అలంకరించి  శాకంబరీ పూజ చేశారు. అనంతరం పారాయణాన్ని పటించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, ఆర్యవైశ్యులు బాగుండాలని, వ్యాపారాలు మరింతగా అభివృద్ధి చెందాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని  శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ని వేడుకున్నట్లు గౌతమ్ శర్మ పేర్కొన్నారు.మండలంలోని ఆర్యవైశ్య సంఘం మహిళలు శాకంబరీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులకు ఆలయపూజారి తీర్థప్రసాదాలు వితరణ చేశారు.