పాలిటెక్నిక్ అడ్మిషన్ల పై అవగాహన

పాలిటెక్నిక్ అడ్మిషన్ల పై అవగాహన

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం అడ్మిషన్ల ప్రక్రియ పైన అవగాహనా సదస్సు నిర్వహించారు. జిల్లాలోని విద్యార్థులు, తల్లి దండ్రులు పాల్గొనన్నారు. కళాశాలలో డిఈఈ, డిసిఈ బ్రాంచీలలో మెరుగైన విద్యను అందిస్తున్నట్లు బాల బాలికలకు హాస్టల్ సదుపాయము ఉన్నట్లు తెలిపారు. నేటి నుంచి స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభము అయినట్లు వివరించారు. ఈ అవగాహనా సదస్సుకి ఎలక్ట్రికల్ బ్రాంచ్ హెడ్ బివివిఎస్ రామకృష్ణ అధ్యక్షుని వహించగాసివిల్ హెడ్ కే . నవీన్ కుమార్, జనరల్ హెడ్, రాజ్ కుమార్, హాస్టల్ మేనేజర్ హజారే బేగం మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.