చేసిన పనులు చెప్పి.. ఓట్లు అడుక్కోవాలి... ఎమ్మెల్యే రాజయ్య

చేసిన పనులు చెప్పి.. ఓట్లు అడుక్కోవాలి... ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: గడిచిన తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుక్కొని గులాబీ జెండాను ఎగరేయాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఆత్మీయ సమావేశాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ, కంటి వెలుగు, ఉచిత కరెంటు మొదలైన పథకాలను ప్రజలకు అందిస్తూ ఐక్యరాజ్యసమితి మెప్పు పొందిన టిఆర్ఎస్ పార్టీని మరోమారు అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి అన్నారు.

కంటి వెలుగు పథకం గిన్నిస్ బుక్ రికార్డు అన్నారు. మాచర్ల గణేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీలు జయశ్రీ, రేఖ, సుదర్శన్ జడ్పిటిసిలు రవి, బేబీ శ్రీనివాస్, వంశీధర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, దేవస్థానం చైర్మన్ శ్రీధర్ రావు, ఆకుల కుమార్, సోమిరెడ్డి, మహేందర్ రెడ్డి, నగర బోయిన శ్రీరాములు, బొంకూర్ మహేష్, గుండా మల్లేష్, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.