పశువును బలిగొన్న చిరుతపులి
![పశువును బలిగొన్న చిరుతపులి](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6421a17185077.jpg)
వణుకుతున్న రైతులు
పెద్దశంకరంపేట, ముద్ర: పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కె.వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు కుమ్మరి సాయిలు పశువులపై దాడి చేసి గాయపరిచడంతో మృత్యువాత పడ్డాయి. ఆదివారం రాత్రి ప్రతి రోజు లాగానే పశువులను చేను దగ్గర తాళ్లతో కట్టి ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం లేచి వెళ్లి పశువులను చూడగా దూడను కట్టిన చోట తల మాత్రం మిగిలి ఉంది. మిగిలిన భాగాలు అటవీ ప్రాంతంలో అక్కడక్కడా పడి ఉన్నాయి.
వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేశాడు. అధికారులు స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల పరిశీలించగా అచ్చులు చూసి అవి పులి పాదాల గుర్తులేనని నిర్ధారించారు. పులిజాడ తెలిసే వరకు రైతులు జాగ్రత్తగా ఉండాలని పొలాలకు చేలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలియజేశారు. నష్టపరిహారం ఇప్పించాలని రైతు కోరారు.